నిరసన వ్యక్తం చేసిన 12 మంది వలసదారుల అరెస్ట్
- July 15, 2020
కువైట్ సిటీ:నిరసన తెలిపే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిపై దూషణలకు దిగిన కారణంగా 12 మంది ఈజిప్టియన్ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 60 మందికి పైగా వలసదారులు అబు ఫతైరాలోని మేన్ పవర్ డిపార్ట్మెంట్స్ వద్ద గుమికూడి, తమ వేతనాల విషయమై ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడంలేదని ఆందోళన చేశారు వలసదారులు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని, వలసదారులు గవర్నమెంట్ కాంట్రాక్టులతో పనిచేస్తున్నారనీ, వారికి సేలరీలు అందడంలేదని గుర్తించారు. కాగా, ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ బ్రిగేడియర్ జనరల్, ముబరక్ మర్జి బ్రిగేడియర్ జనరల్, వలసదారుల ఫిర్యాదుల్ని స్వీకరించారు. వారి సమస్యల్ని మ్యాన్ పవర్ అథారిటీకి తెలియజేస్తామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?