యూ.ఏ.ఈ నుంచి తెలుగు రాష్ట్రాలకు 10 ఛార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు
- July 15, 2020
యూ.ఏ.ఈ:ఏ.పి ముఖ్యమంత్రి Y.S.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు APNRT చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారు వెంకట్ మేడపాటి వారి పర్యవేక్షణలో యూ.ఏ.ఈ నుంచి కోస్తా ట్రావెల్స్ వారి సహాయంతో ఈ రోజువరకు 8 ప్రత్యేకవిమానాలు ఆంధ్రప్రదేశ్ కు,రెండు ప్రత్యేకవిమానాలు తెలంగాణ రాష్ట్రాలకు 1680 మంది తెలుగు పనులు కోల్పోయిన శ్రామికులతోటి ,గర్భిణీ స్త్రీ లకు ,అత్యవసర వైద్య సదుపాయము కావలసిన వారి గూర్చి నడిపినట్లు, మరియు 8ప్రత్యేక విమానాలు నడుపుటకు నిర్ణయం తీసుకోనట్టుగా APNRT యూఏఈ పర్యవేక్షుకులు, వైస్సార్సీపీ యూఏఈ కోర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి ఒక పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అహర్నిశలు కృషిచేస్తున్న టీం సభ్యులు రెడ్డయ్యరెడ్డి, శ్యాంరెడ్డి,కుమార్ చంద్, పడాల బ్రహ్మానంద రెడ్డి, సుబ్బారెడ్డి ,మోహన్,జాఫర్అలీ, నాజర్ వలి,అక్రమ్, రమేశ్ రెడ్డి మరియు తదితర APNRT బృందానికి UAE తెలుగుసమాజం కృతజ్ఞతలు తెలుపుచున్నది.ఈ కార్యక్రమానికి విశేషమైన సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి Y.S.జగన్మోహన్ రెడ్డి ,APNRT చైర్మన్ వెంకట్ మేడపాటి ,UAE లోని షార్జా ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాన్సన్ , APNTT సీఈఓ శ్రీనివాస్ రావు యూఏఈ లో ఉన్న తెలుగు ప్రజలు తరుపున కృతజ్ఞతలు తెలపడము జరిగినది.



తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







