యూ.ఏ.ఈ నుంచి తెలుగు రాష్ట్రాలకు 10 ఛార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు
- July 15, 2020
యూ.ఏ.ఈ:ఏ.పి ముఖ్యమంత్రి Y.S.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు APNRT చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారు వెంకట్ మేడపాటి వారి పర్యవేక్షణలో యూ.ఏ.ఈ నుంచి కోస్తా ట్రావెల్స్ వారి సహాయంతో ఈ రోజువరకు 8 ప్రత్యేకవిమానాలు ఆంధ్రప్రదేశ్ కు,రెండు ప్రత్యేకవిమానాలు తెలంగాణ రాష్ట్రాలకు 1680 మంది తెలుగు పనులు కోల్పోయిన శ్రామికులతోటి ,గర్భిణీ స్త్రీ లకు ,అత్యవసర వైద్య సదుపాయము కావలసిన వారి గూర్చి నడిపినట్లు, మరియు 8ప్రత్యేక విమానాలు నడుపుటకు నిర్ణయం తీసుకోనట్టుగా APNRT యూఏఈ పర్యవేక్షుకులు, వైస్సార్సీపీ యూఏఈ కోర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి ఒక పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అహర్నిశలు కృషిచేస్తున్న టీం సభ్యులు రెడ్డయ్యరెడ్డి, శ్యాంరెడ్డి,కుమార్ చంద్, పడాల బ్రహ్మానంద రెడ్డి, సుబ్బారెడ్డి ,మోహన్,జాఫర్అలీ, నాజర్ వలి,అక్రమ్, రమేశ్ రెడ్డి మరియు తదితర APNRT బృందానికి UAE తెలుగుసమాజం కృతజ్ఞతలు తెలుపుచున్నది.ఈ కార్యక్రమానికి విశేషమైన సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి Y.S.జగన్మోహన్ రెడ్డి ,APNRT చైర్మన్ వెంకట్ మేడపాటి ,UAE లోని షార్జా ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాన్సన్ , APNTT సీఈఓ శ్రీనివాస్ రావు యూఏఈ లో ఉన్న తెలుగు ప్రజలు తరుపున కృతజ్ఞతలు తెలపడము జరిగినది.



తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







