మస్కట్:సరైన అనుమతులతో ప్రవాసీయులు ఓమన్ తిరిగి రావొచ్చు
- July 16, 2020
మస్కట్:లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు, విద్యార్ధులు ఓమన్ తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయా దేశాల్లోని ఓమన్ రాయబార కార్యాలయం నుంచి అనుమతి పొందిన వాళ్లంతా ప్రత్యేక విమానాల్లో తిరిగి ఓమన్ రావొచ్చని అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కు ముందు స్వదేశాలకు వెళ్లిన వారు..ఆఫీసు పనుల నిమిత్తం, వ్యాపార పనుల కోసం విదేశాలకు వెళ్లిన వారు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు..చదువు కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్ధులు కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి వారు వెంటనే ఆయా దేశాల్లోని ఓమన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తగిన అనుమతులు పొందాలని, అనుమతి తీసుకున్నవారు నిరభ్యంతరంగా ఓమన్ తిరిగి రావొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







