అబుధాబి:వాహనదారులకు హెచ్చరిక.. స్పీడ్ లేన్ లో నెమ్మదిగా వెళ్తే DH 400 జరిమానా
- July 16, 2020
అబుధాబి:వాహనదారులకు అబుధాబి పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. స్పీడ్ లేన్లలో ఎవరైనా వాహనదారులు నెమ్మదిగా వెళ్లినా..ఎడమ వైపు నుంచి వచ్చే వాహనాలకు దారి ఇవ్వకపోయినా DH 400 వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లెఫ్ట్ లేన్ లో వెళ్లే వాహనాలను ఆయా రహదారిలో నిర్దేశించిన నిర్ణీత వేగంతో వెళ్లాలని పోలీసులు సూచించారు. అలాకాకుండా నెమ్మదిగా వెళ్లటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు ప్రమాదాలకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలను స్పీడ్ లేన్ లో కాకుండా కుడి వైపు దారిలో వెళ్లాలని అబుధాబి పోలీసులు సూచించారు. గత సెప్టెంబర్ లో ప్రారంభించిన 'బీ రోడ్ సేఫ్' క్యాంపేన్ లో భాగంగా ఈ తాజా హెచ్చరికలు జారీ చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







