అబుధాబి:వాహనదారులకు హెచ్చరిక.. స్పీడ్ లేన్ లో నెమ్మదిగా వెళ్తే DH 400 జరిమానా
- July 16, 2020
అబుధాబి:వాహనదారులకు అబుధాబి పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. స్పీడ్ లేన్లలో ఎవరైనా వాహనదారులు నెమ్మదిగా వెళ్లినా..ఎడమ వైపు నుంచి వచ్చే వాహనాలకు దారి ఇవ్వకపోయినా DH 400 వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లెఫ్ట్ లేన్ లో వెళ్లే వాహనాలను ఆయా రహదారిలో నిర్దేశించిన నిర్ణీత వేగంతో వెళ్లాలని పోలీసులు సూచించారు. అలాకాకుండా నెమ్మదిగా వెళ్లటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు ప్రమాదాలకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలను స్పీడ్ లేన్ లో కాకుండా కుడి వైపు దారిలో వెళ్లాలని అబుధాబి పోలీసులు సూచించారు. గత సెప్టెంబర్ లో ప్రారంభించిన 'బీ రోడ్ సేఫ్' క్యాంపేన్ లో భాగంగా ఈ తాజా హెచ్చరికలు జారీ చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







