అబుధాబి:వాహనదారులకు హెచ్చరిక.. స్పీడ్ లేన్ లో నెమ్మదిగా వెళ్తే DH 400 జరిమానా
- July 16, 2020
అబుధాబి:వాహనదారులకు అబుధాబి పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. స్పీడ్ లేన్లలో ఎవరైనా వాహనదారులు నెమ్మదిగా వెళ్లినా..ఎడమ వైపు నుంచి వచ్చే వాహనాలకు దారి ఇవ్వకపోయినా DH 400 వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లెఫ్ట్ లేన్ లో వెళ్లే వాహనాలను ఆయా రహదారిలో నిర్దేశించిన నిర్ణీత వేగంతో వెళ్లాలని పోలీసులు సూచించారు. అలాకాకుండా నెమ్మదిగా వెళ్లటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు ప్రమాదాలకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలను స్పీడ్ లేన్ లో కాకుండా కుడి వైపు దారిలో వెళ్లాలని అబుధాబి పోలీసులు సూచించారు. గత సెప్టెంబర్ లో ప్రారంభించిన 'బీ రోడ్ సేఫ్' క్యాంపేన్ లో భాగంగా ఈ తాజా హెచ్చరికలు జారీ చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







