సౌదీ:వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
- July 16, 2020
రియాద్:వరుస చోరీలకు పాల్పడుతున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులున్న ఈ ముఠా సౌదీ అరేబియాలోని దమ్మమ్ ప్రాంతంలో కొద్ది కాలంగా వరుస చోరీలకు పాల్పడుతోంది. పోలీసులమని చెబుతూ ఇళ్లలోకి చొరబడి దోపిడికి తెగబడింది. పార్క్ చేసిన వాహనాలను ఎత్తుకుపోవటం..ఆయుధాలతో కార్మికులను బెదిరించి వారి దగ్గర్నుంచి డబ్బు ఎత్తుకెళ్తూ దురాగాతాలకు పాల్పడింది. ముఖ్యంగా ప్రవాస కార్మికులను టార్గెట్ గా చేసుకొని పోలీసులమని బెదిరించి ఉన్నదంతా దోచుకుపోయేవారు. ఈ దొంగల ముఠా అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదుల వెల్లువలా వచ్చిపడటంతో..వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేశారు దమ్మమ్ పోలీసులు. కొన్నాళ్లుగా పలు ప్రాంతాల్లో నిఘా వేశారు. ఎట్టకేలకు ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 47 నేరాల్లో ముగ్గురు దొంగలు నిందితులుగా ఉన్నారు. పట్టుబడిన దొంగల ముఠాను రిమాండ్ కు తరలించిన పోలీసులు..తదుపరి న్యాయవిచారణ కోసం కేసును బదిలీ చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







