సౌదీ:వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
- July 16, 2020
రియాద్:వరుస చోరీలకు పాల్పడుతున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులున్న ఈ ముఠా సౌదీ అరేబియాలోని దమ్మమ్ ప్రాంతంలో కొద్ది కాలంగా వరుస చోరీలకు పాల్పడుతోంది. పోలీసులమని చెబుతూ ఇళ్లలోకి చొరబడి దోపిడికి తెగబడింది. పార్క్ చేసిన వాహనాలను ఎత్తుకుపోవటం..ఆయుధాలతో కార్మికులను బెదిరించి వారి దగ్గర్నుంచి డబ్బు ఎత్తుకెళ్తూ దురాగాతాలకు పాల్పడింది. ముఖ్యంగా ప్రవాస కార్మికులను టార్గెట్ గా చేసుకొని పోలీసులమని బెదిరించి ఉన్నదంతా దోచుకుపోయేవారు. ఈ దొంగల ముఠా అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదుల వెల్లువలా వచ్చిపడటంతో..వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేశారు దమ్మమ్ పోలీసులు. కొన్నాళ్లుగా పలు ప్రాంతాల్లో నిఘా వేశారు. ఎట్టకేలకు ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 47 నేరాల్లో ముగ్గురు దొంగలు నిందితులుగా ఉన్నారు. పట్టుబడిన దొంగల ముఠాను రిమాండ్ కు తరలించిన పోలీసులు..తదుపరి న్యాయవిచారణ కోసం కేసును బదిలీ చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







