సౌదీ:వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
- July 16, 2020
రియాద్:వరుస చోరీలకు పాల్పడుతున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులున్న ఈ ముఠా సౌదీ అరేబియాలోని దమ్మమ్ ప్రాంతంలో కొద్ది కాలంగా వరుస చోరీలకు పాల్పడుతోంది. పోలీసులమని చెబుతూ ఇళ్లలోకి చొరబడి దోపిడికి తెగబడింది. పార్క్ చేసిన వాహనాలను ఎత్తుకుపోవటం..ఆయుధాలతో కార్మికులను బెదిరించి వారి దగ్గర్నుంచి డబ్బు ఎత్తుకెళ్తూ దురాగాతాలకు పాల్పడింది. ముఖ్యంగా ప్రవాస కార్మికులను టార్గెట్ గా చేసుకొని పోలీసులమని బెదిరించి ఉన్నదంతా దోచుకుపోయేవారు. ఈ దొంగల ముఠా అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదుల వెల్లువలా వచ్చిపడటంతో..వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేశారు దమ్మమ్ పోలీసులు. కొన్నాళ్లుగా పలు ప్రాంతాల్లో నిఘా వేశారు. ఎట్టకేలకు ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 47 నేరాల్లో ముగ్గురు దొంగలు నిందితులుగా ఉన్నారు. పట్టుబడిన దొంగల ముఠాను రిమాండ్ కు తరలించిన పోలీసులు..తదుపరి న్యాయవిచారణ కోసం కేసును బదిలీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







