యూ.ఏ.ఈ:1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్...
- July 16, 2020
యూ.ఏ.ఈ :అజ్మాన్లోని ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్కు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో జాక్పాట్ తగిలింది. గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న మాలతి దాస్ డి.డి.ఎఫ్ డ్రాలో ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(36,73,026 dhs) గెలుచుకున్నారు. గత 32 ఏళ్లుగా ఆమె ఈ రాఫెల్లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, జూన్ 26న కొన్న లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటిశ్వరురాలిని చేసింది. దీంతో మాలతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాఫెల్ నిర్వహకులకు మాలతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇకపై కూడా తాను డి.డి.ఎఫ్ ఫ్రీ ర్యాఫిల్ టికెట్లు కొనడం మానబోయేది లేదని చెప్పారు.
1999లో ప్రారంభమైన ఈ ర్యాఫిల్ ద్వారా ఇప్పటివరకు కోటిశ్వరులుగా అవతరించిన భారతీయులలో మాలతితో కలిపి 165 మంది అయ్యారని లాటరీ నిర్వహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







