యూ.ఏ.ఈ:1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్...
- July 16, 2020
యూ.ఏ.ఈ :అజ్మాన్లోని ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్కు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో జాక్పాట్ తగిలింది. గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న మాలతి దాస్ డి.డి.ఎఫ్ డ్రాలో ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(36,73,026 dhs) గెలుచుకున్నారు. గత 32 ఏళ్లుగా ఆమె ఈ రాఫెల్లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, జూన్ 26న కొన్న లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటిశ్వరురాలిని చేసింది. దీంతో మాలతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాఫెల్ నిర్వహకులకు మాలతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇకపై కూడా తాను డి.డి.ఎఫ్ ఫ్రీ ర్యాఫిల్ టికెట్లు కొనడం మానబోయేది లేదని చెప్పారు.
1999లో ప్రారంభమైన ఈ ర్యాఫిల్ ద్వారా ఇప్పటివరకు కోటిశ్వరులుగా అవతరించిన భారతీయులలో మాలతితో కలిపి 165 మంది అయ్యారని లాటరీ నిర్వహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







