యూ.ఏ.ఈ:1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్...
- July 16, 2020
యూ.ఏ.ఈ :అజ్మాన్లోని ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్కు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో జాక్పాట్ తగిలింది. గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న మాలతి దాస్ డి.డి.ఎఫ్ డ్రాలో ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(36,73,026 dhs) గెలుచుకున్నారు. గత 32 ఏళ్లుగా ఆమె ఈ రాఫెల్లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, జూన్ 26న కొన్న లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటిశ్వరురాలిని చేసింది. దీంతో మాలతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాఫెల్ నిర్వహకులకు మాలతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇకపై కూడా తాను డి.డి.ఎఫ్ ఫ్రీ ర్యాఫిల్ టికెట్లు కొనడం మానబోయేది లేదని చెప్పారు.
1999లో ప్రారంభమైన ఈ ర్యాఫిల్ ద్వారా ఇప్పటివరకు కోటిశ్వరులుగా అవతరించిన భారతీయులలో మాలతితో కలిపి 165 మంది అయ్యారని లాటరీ నిర్వహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?