యూ.ఏ.ఈ:విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా
- July 16, 2020
యూ.ఏ.ఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. లాక్ డౌన్ యూఏఈలో ఉండే ప్రవాసీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది. వాళ్లందరూ తిరిగి యూఏఈ చేరుకునేందుకు నిబంధనలను సులభతరం కూడా చేసింది. ఆగస్ట్ ఫస్ట్ నుంచి విమాన సర్వీసులను కూడా ప్రారంభించబోతోంది. అయితే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న యూఏఈ..విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని నిబంధన విధించింది. వైరస్ తక్కువ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు వారం పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని, అలాగే ఎక్కువ తీవ్రత కలిగిన దేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







