యూ.ఏ.ఈ:విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా
- July 16, 2020
యూ.ఏ.ఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. లాక్ డౌన్ యూఏఈలో ఉండే ప్రవాసీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది. వాళ్లందరూ తిరిగి యూఏఈ చేరుకునేందుకు నిబంధనలను సులభతరం కూడా చేసింది. ఆగస్ట్ ఫస్ట్ నుంచి విమాన సర్వీసులను కూడా ప్రారంభించబోతోంది. అయితే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న యూఏఈ..విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని నిబంధన విధించింది. వైరస్ తక్కువ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు వారం పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని, అలాగే ఎక్కువ తీవ్రత కలిగిన దేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







