యూ.ఏ.ఈ:విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా
- July 16, 2020
యూ.ఏ.ఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. లాక్ డౌన్ యూఏఈలో ఉండే ప్రవాసీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది. వాళ్లందరూ తిరిగి యూఏఈ చేరుకునేందుకు నిబంధనలను సులభతరం కూడా చేసింది. ఆగస్ట్ ఫస్ట్ నుంచి విమాన సర్వీసులను కూడా ప్రారంభించబోతోంది. అయితే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న యూఏఈ..విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని నిబంధన విధించింది. వైరస్ తక్కువ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు వారం పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని, అలాగే ఎక్కువ తీవ్రత కలిగిన దేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







