అబుధాబి:మోడిఫై కార్లపై కొరడా...గతేడాదిలో 11వేల వాహనదారులకు ఫైన్
- July 17, 2020
అబుధాబి:మోడిఫై కార్లతో పెద్దగా శబ్ధాలు వచ్చేలా డ్రైవింగ్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులపై యూఏఈ పోలీసులు కొరఢా ఝుళిపించారు. పోయిన ఏడాది ఏకంగా 11 వేల మంది వాహనదారులకు జరిమానా విధించారు. కంపెనీ కార్లకు కొత్త సైలెన్సర్లను బిగించి పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లటం కుర్రకారుకు షోకుగా మారిపోయింది. అలాగే మోడిఫై కార్లతో రేస్ లలో పాల్గొంటున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలా ప్రధాన రహదారులు, నివాసిత ప్రాంతాల మధ్య న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులకు ఒక్కొక్కరికి Dh2,000 జరిమానా 12 బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ విధించారు పోలీసులు. అలాగే హారన్ సౌండ్ ను పెంచి పాదచారులను అదరగొట్టేలా న్యూసెన్స్ చేస్తున్న వారికి Dh400 జరిమానా 4 బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ విధించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







