అబుధాబి:మోడిఫై కార్లపై కొరడా...గతేడాదిలో 11వేల వాహనదారులకు ఫైన్
- July 17, 2020
అబుధాబి:మోడిఫై కార్లతో పెద్దగా శబ్ధాలు వచ్చేలా డ్రైవింగ్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులపై యూఏఈ పోలీసులు కొరఢా ఝుళిపించారు. పోయిన ఏడాది ఏకంగా 11 వేల మంది వాహనదారులకు జరిమానా విధించారు. కంపెనీ కార్లకు కొత్త సైలెన్సర్లను బిగించి పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లటం కుర్రకారుకు షోకుగా మారిపోయింది. అలాగే మోడిఫై కార్లతో రేస్ లలో పాల్గొంటున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలా ప్రధాన రహదారులు, నివాసిత ప్రాంతాల మధ్య న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులకు ఒక్కొక్కరికి Dh2,000 జరిమానా 12 బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ విధించారు పోలీసులు. అలాగే హారన్ సౌండ్ ను పెంచి పాదచారులను అదరగొట్టేలా న్యూసెన్స్ చేస్తున్న వారికి Dh400 జరిమానా 4 బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ విధించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







