అయోధ్య:ఆగస్టులో రామాలయ శంకుస్థాపన
- July 17, 2020అయోధ్య:అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేస్తుంది. ఆలయ శంకుస్థాపన తేదీని ఆదివారం ఖరారు చేయనున్నారు. శంకుస్థాపన పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. మోదీకి ఆమోదంగా ఉన్న రోజున శంకుస్థాపనకు సిద్దం చేస్తామని అన్నారు. తేదీ ఖరారు చేసిన తరువాత ప్రధానికి ఆహ్వానం పంపిస్తామని.. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా ఆహ్వానిస్తామని ట్రస్టు చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఆగస్టులో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు సిద్దం అవుతున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతోపాటు.. చాలా మంది ప్రముఖులు పాల్గొంటారని ట్రస్టు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు