అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల గురి: కమాండర్వీ ఎస్ ఠాకూర్

- July 17, 2020 , by Maagulf
అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల గురి: కమాండర్వీ ఎస్ ఠాకూర్

హిందువులకు గొప్ప పుణ్యతీర్థమైన అమర్నాథ్ ఆలయంపై తీవ్రవాదులు దృష్టి సారించినట్లు సైన్యం చెబుతోంది. అమర్నాథ్ యాత్రకోసం వెళ్లే యాత్రికులే లక్షంగా దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. మరో 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ రహదారి-44 పైనే తీవ్రవాదులు గురిపెట్టినట్లు సెక్టార్-2 కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ తెలిపారు. ఈ మార్గం నుంచే యాత్రికులు ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటారని, అందువల్ల ఈ ప్రాంతమే అత్యంత ప్రాధాన్యమైందని వివరించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి-44 మొత్తం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, అమర్నాథ్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ కల్పిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com