మదీనా మసీదులలో మహిళా కార్మికులను నియమించిన సౌదీ ప్రభుత్వం

- July 18, 2020 , by Maagulf
మదీనా మసీదులలో మహిళా కార్మికులను నియమించిన సౌదీ ప్రభుత్వం

రియాద్:మదీనా మసీదులలో మహిళా విభాగాల్లో సేవలు అందించేందుకు కావాల్సిన మహిళా కార్మికులను నియమించింది సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ మహిళా ఉద్యోగులు ఆయా మహిళా విభాగాల్లో తమ విధులు నిర్వహిస్తారని, ప్రార్ధన నిర్వహణ, భక్తుల నియంత్రణలో వీరు తమ సేవలను అందిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త నియమించిన మహిళా కార్మికులు తమ విధులును సమర్ధవంతంగా నిర్వర్తించేలా మంత్రిత్వశాఖ వారికి అవసరమైన చోట్ల పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించటంతో పాటు..ముందస్తు జాగ్రత్త చర్యల నిర్వహణలో సేవలు అందించనున్నట్లు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com