ఖతార్:వదిలివేసిన వాహనాల తొలగింపుపై జాయింట్ కమిటీ సమీక్ష
- July 18, 2020
దోహా:ఖతార్ పారిశ్రామిక వాడలో ఇబ్బడిముబ్బడిగా వదిలివేసిన వాహనాలు స్థానిక పాలకులకు పెద్ద సమస్యగా మారాయి. రోడ్లపై వదిలివేసిన వాహనాల కారణంగా దొంగతనాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో పాటు నగర ఇమేజ్ ను కూడా దెబ్బతీస్తున్నాయన్నది పాలకుల వాదన. నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు ఈ పరిణామం అవరోధంగా మారుతోంది కూడా. దీంతో చాలాకాలంగా నిరుపయోగంగా రోడ్లపై ఉన్న వాహనాలను వాటి యజమానులు వెంటనే తొలగించాలని గతంలోనే అధికారులు సూచించారు. దీనికి సంబంధించి తీర్మానం 187, 2020 కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే..వాహనాల తొలగింపు చర్యల పురోగతిపై చర్చించేందుకు సమావేశమైన జాయింట్ కమిటీ..వాహనాల తొలగింపులో ఎదురవుతున్న అవరోధాలపై సమీక్షించారు. పబ్లిక్ క్లీన్నెస్ లా 18, 2017 చట్టాన్ని అమలు చేసి వాహనాలను తొలగించాలని జాయింట్ కమిటీ అధికారులకు సూచించింది. వీధులలో వదిలివేసిన వాహనాలకు సంబంధించి ఎదైనా సందేహాలు ఉంటే 33238885 నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







