ఖతార్:వదిలివేసిన వాహనాల తొలగింపుపై జాయింట్ కమిటీ సమీక్ష
- July 18, 2020
దోహా:ఖతార్ పారిశ్రామిక వాడలో ఇబ్బడిముబ్బడిగా వదిలివేసిన వాహనాలు స్థానిక పాలకులకు పెద్ద సమస్యగా మారాయి. రోడ్లపై వదిలివేసిన వాహనాల కారణంగా దొంగతనాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో పాటు నగర ఇమేజ్ ను కూడా దెబ్బతీస్తున్నాయన్నది పాలకుల వాదన. నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు ఈ పరిణామం అవరోధంగా మారుతోంది కూడా. దీంతో చాలాకాలంగా నిరుపయోగంగా రోడ్లపై ఉన్న వాహనాలను వాటి యజమానులు వెంటనే తొలగించాలని గతంలోనే అధికారులు సూచించారు. దీనికి సంబంధించి తీర్మానం 187, 2020 కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే..వాహనాల తొలగింపు చర్యల పురోగతిపై చర్చించేందుకు సమావేశమైన జాయింట్ కమిటీ..వాహనాల తొలగింపులో ఎదురవుతున్న అవరోధాలపై సమీక్షించారు. పబ్లిక్ క్లీన్నెస్ లా 18, 2017 చట్టాన్ని అమలు చేసి వాహనాలను తొలగించాలని జాయింట్ కమిటీ అధికారులకు సూచించింది. వీధులలో వదిలివేసిన వాహనాలకు సంబంధించి ఎదైనా సందేహాలు ఉంటే 33238885 నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







