సౌదీలో చిక్కుకుపోయిన 105 మందిని వెనక్కి రప్పించిన యూఏఈ
- July 18, 2020
షార్జా:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 105 మంది కార్మికుల్ని యూఏఈ ఎయిర్ లిఫ్ట్ చేసింది. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారంతా చేరుకున్నారు. ఓసియన్ ఆయిల్ ఫీల్డ్లో వీరంతా పనిచేస్తున్నారు. ఆఫ్షోర్ ఆన్ షోర్ ప్రాజెక్టుల నిమిత్తం వీరంతా షార్జా ఫ్రీ జోన్లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ అప్రూవల్ తర్వాత ప్రయాణీకుల్ని రీపాట్రియేషన్ చేశారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్, షార్జా పోలీస్ అథారిటీస్ అలాగే ఎయిర్ అరేబియా సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. 105 మంది తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఓసియన్ ఆయిల్ ఫీల్డ్ ఛైర్మన్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?