యూ.ఏ.ఈ:మాల్స్,టవర్స్ లో రేపటి నుంచి ప్రార్ధనలకు అనుమతి
- July 19, 2020
యూ.ఏ.ఈ:లాక్ డౌన్ తర్వాత సాధారణ జనజీవన పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా మరో కీలక నిర్ణయం వెలువడింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి అన్ని మాల్స్, టవర్స్ లోని ప్రార్ధనా గదుల్లో ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే..కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రార్ధనా మందిరం కోసం కేటాయించిన గది సామర్ధ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే ప్రతి భక్తుడి మధ్య ఖచ్చితంగా 2 మీటర్ల దూరం పాటించాలి. ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ప్రార్ధనకు ముందు, ప్రార్ధన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జనం ఒక్క దగ్గర గూమికూడొద్దు. అలాగే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆలింగనం చేసుకోకూడదు. ఇక ప్రార్ధన సమయంలోనూ జాగ్రత్తలు పాటించాలంటూ కొన్ని సూచనలు చేసింది. ప్రతి భక్తుడు అల్ హోస్న్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ స్మార్ట్ ఫోన్ లో చూసుకుంటూ పవిత్ర ఖురాన్ ను చదవాల్సి ఉంటుంది. ప్రార్ధన ముగిసిన వెంటనే స్టెరిలైజ్ చేయాలని మార్గదర్శకాలు వెలువరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు