యూ.ఏ.ఈ:మాల్స్,టవర్స్ లో రేపటి నుంచి ప్రార్ధనలకు అనుమతి
- July 19, 2020
యూ.ఏ.ఈ:లాక్ డౌన్ తర్వాత సాధారణ జనజీవన పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా మరో కీలక నిర్ణయం వెలువడింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి అన్ని మాల్స్, టవర్స్ లోని ప్రార్ధనా గదుల్లో ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే..కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రార్ధనా మందిరం కోసం కేటాయించిన గది సామర్ధ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే ప్రతి భక్తుడి మధ్య ఖచ్చితంగా 2 మీటర్ల దూరం పాటించాలి. ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ప్రార్ధనకు ముందు, ప్రార్ధన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జనం ఒక్క దగ్గర గూమికూడొద్దు. అలాగే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆలింగనం చేసుకోకూడదు. ఇక ప్రార్ధన సమయంలోనూ జాగ్రత్తలు పాటించాలంటూ కొన్ని సూచనలు చేసింది. ప్రతి భక్తుడు అల్ హోస్న్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ స్మార్ట్ ఫోన్ లో చూసుకుంటూ పవిత్ర ఖురాన్ ను చదవాల్సి ఉంటుంది. ప్రార్ధన ముగిసిన వెంటనే స్టెరిలైజ్ చేయాలని మార్గదర్శకాలు వెలువరించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







