అలెర్ట్..అలెర్ట్..'కమ్యూనిటీ స్ప్రెడ్' దశలో భారత్: ఐఎంఏ
- July 19, 2020
న్యూఢిల్లీ: భారత్లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 34 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలు 38 వేల 715 దాటింది. భారతదేశంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని, పరిస్థితి మరింత దిగజారిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ వి కె మోంగా మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిపారు. భారతదేశంలో ప్రతిరోజూ 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ మోంగా పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందుతున్నదని అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా సన్నద్ధమవ్వాలని అన్నారు. కాగా అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా రోగులు అధికసంఖ్యలో భారతదేశంలోనే ఉన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







