అంగారక గ్రహంపైకి యూఏఈ తొలి స్పేస్క్రాఫ్ట్
- July 20, 2020
యూఏఈ: రెడ్ ప్లానెట్ గుట్టుమట్లను ఆవిష్కరించేందుకు అంగారక గ్రహానికి తొలి అరబ్ స్పేస్ మిషన్ హోప్ను జపాన్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధి చేసిన ఈ స్పేస్క్రాఫ్ట్ను సోమవారం ఉదయం జపాన్ రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా మోసుకెళ్లిందని అధికారులు తెలిపారు. అరబిక్లో అల్-అమల్గా పేరొందిన ఈ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ప్రయోగం జరిగిన గంటతర్వాత స్పేస్క్రాఫ్ట్ రాకెట్ నుంచి విడిపోయి నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని రాకెట్ తయారీ సంస్థ మిట్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ పేర్కొంది.
తమ స్పేస్మిషన్ యూఏఈ సహా ఈ ప్రాంతానికి కీలక మైలురాయి వంటిదని మహ్మద్ బిన్ రషీద్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ హమద్ అషియబని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హోప్ అంగారక గ్రహంపై అడుగుపెడుతుందని భావిస్తున్నారు. ‘హోప్’ పేరుతో ఓ ప్రోబ్ని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించారు. ఓ కారు సైజ్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ వుంటుంది. 2021 జనవరి - మార్చి మధ్యలో ఈ ప్రోబ్, మార్స్ని చేరుకోనుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే, మొట్టమొదటి అరబ్ మిషన్గా దీనికి పేరు దక్కుతుంది.
అంగారక గ్రహంపైకి తొలి స్పేస్క్రాఫ్ట్ను పంపడంపై యూఏఈ ప్రభుత్వం ట్విటర్లో స్పందిస్తూ ఇది అరబ్ ప్రాంతానికి గర్వకారణంతో పాటు సరికొత్త ఆశలు చిగురింపచేసేదని వ్యాఖ్యానించింది. హోప్ మిషన్ ప్లానెట్పై ప్రత్యేక అంశాలను ఆవిష్కరిస్తుందని మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒమ్రన్ షరాఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021 సెప్టెంబర్లో హోప్ మిషన్ భూమండలానికి సమాచారాన్ని చేరవేస్తుందని, ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు అథ్యయనం కోసం అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?