మరో 4 భారతీయ నగరాలకు..ఎమిరేట్స్ ఎయిర్లైన్స్
- July 20, 2020
దుబాయ్:దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. జూలై 26 వరకు మరో నాలుగు భారతీయ నగరాలకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఇరు దేశాల మధ్య ఈ నెల 12 నుంచి 26 వరకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడిపేందుకు భారత్, యూఏఈ పౌరవిమానయాన శాఖల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, ముంబై, తిరువనంతపురం ప్రాంతాలకు విమానలను నడపనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మొదట ప్రకటించింది. తాజాతా అహమ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ‘వందే భారత్ మిషన్’నాలుగో విడుతలో భాగంగా ఈ విమానాలు యూఏఈలో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను ఇండియాకు తరలిస్తున్నాయి. అదే విధంగా ఇండియాలో చిక్కుకున్న యూఏఈ నివాసితులు, ఎన్నారైలను యూఏఈకి తరలిస్తాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







