మరో 4 భారతీయ నగరాలకు..ఎమిరేట్స్ ఎయిర్లైన్స్
- July 20, 2020
దుబాయ్:దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. జూలై 26 వరకు మరో నాలుగు భారతీయ నగరాలకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఇరు దేశాల మధ్య ఈ నెల 12 నుంచి 26 వరకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడిపేందుకు భారత్, యూఏఈ పౌరవిమానయాన శాఖల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, ముంబై, తిరువనంతపురం ప్రాంతాలకు విమానలను నడపనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మొదట ప్రకటించింది. తాజాతా అహమ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ‘వందే భారత్ మిషన్’నాలుగో విడుతలో భాగంగా ఈ విమానాలు యూఏఈలో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను ఇండియాకు తరలిస్తున్నాయి. అదే విధంగా ఇండియాలో చిక్కుకున్న యూఏఈ నివాసితులు, ఎన్నారైలను యూఏఈకి తరలిస్తాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







