మరో 4 భారతీయ నగరాలకు..ఎమిరేట్స్ ఎయిర్లైన్స్

- July 20, 2020 , by Maagulf
మరో 4 భారతీయ నగరాలకు..ఎమిరేట్స్ ఎయిర్లైన్స్

దుబాయ్:దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. జూలై 26 వరకు మరో నాలుగు భారతీయ నగరాలకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఇరు దేశాల మధ్య ఈ నెల 12 నుంచి 26 వరకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడిపేందుకు భారత్, యూఏఈ పౌరవిమానయాన శాఖల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, ముంబై, తిరువనంతపురం ప్రాంతాలకు విమానలను నడపనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మొదట ప్రకటించింది. తాజాతా అహమ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ‘వందే భారత్ మిషన్’నాలుగో విడుతలో భాగంగా ఈ విమానాలు యూఏఈలో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను ఇండియాకు తరలిస్తున్నాయి. అదే విధంగా ఇండియాలో చిక్కుకున్న యూఏఈ నివాసితులు, ఎన్నారైలను యూఏఈకి తరలిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com