మస్కట్: ఆర్వోపీ సెంటర్స్ లో వాహనాల ఫిట్నెస్ తనిఖీలు పున:ప్రారంభం
- July 21, 2020
కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన వాహనాల ఫిట్నెస్ టెస్టులు, సర్టిఫికెట్ల రెన్యూవల్ ప్రక్రియ పున:ప్రారంభం అయ్యాయి. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాయల్ ఓమన్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో 10 ఏళ్ల మించి పాతబడిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఓమన్ లో పలు ప్రభుత్వ సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. గత మార్చి 21 నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలను కూడా నిలిపివేశారు. రెన్యూవల్ గడువు ముగిసిన వారికి కొద్ది రోజులు మినహాయింపు ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా రెన్యూవల్ చేశారు. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పలు రంగాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం..ఇక నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఓమన్ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పదేళ్లకుపైబడిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించి వాహనాలకు మళ్లీ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. దీంతో దేశంలోని రాయల్ ఓమన్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో వాహనాలకు ఫిట్నెస్ టెస్టులు విధిగా చేయించుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







