మస్కట్: ఆర్వోపీ సెంటర్స్ లో వాహనాల ఫిట్నెస్ తనిఖీలు పున:ప్రారంభం
- July 21, 2020
కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన వాహనాల ఫిట్నెస్ టెస్టులు, సర్టిఫికెట్ల రెన్యూవల్ ప్రక్రియ పున:ప్రారంభం అయ్యాయి. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాయల్ ఓమన్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో 10 ఏళ్ల మించి పాతబడిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఓమన్ లో పలు ప్రభుత్వ సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. గత మార్చి 21 నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలను కూడా నిలిపివేశారు. రెన్యూవల్ గడువు ముగిసిన వారికి కొద్ది రోజులు మినహాయింపు ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా రెన్యూవల్ చేశారు. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పలు రంగాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం..ఇక నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఓమన్ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పదేళ్లకుపైబడిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించి వాహనాలకు మళ్లీ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. దీంతో దేశంలోని రాయల్ ఓమన్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో వాహనాలకు ఫిట్నెస్ టెస్టులు విధిగా చేయించుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







