భారత్ నుంచి యూఏఈ వెళ్లే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టెస్ట్ అవసరం లేదు
- July 21, 2020
భారత్ నుంచి యూఏఈ వెళ్లే వారికి ఆ దేశ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పన్నెండేళ్లలోపు వారికి కోవిడ్ టెస్టులు అవసరం లేదని అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లుగా యూఏఈ వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళం తొలిగిపోయింది. ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన యూఏఈ ప్రభుత్వం..ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు 12 ఏళ్లుపైబడిన వారికే కోవిడ్ టెస్టులు తప్పనిసరి అంటూ స్పష్టతనిచ్చింది. అయితే..ఈ విషయంలో ఏమైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్ సైట్లలో వివరాలు వెల్లడిస్తామని కూడా తెలిపింది. ఇక 12 ఏళ్లపైబడిన వారికి మాత్రం భారత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్ ల ద్వారా కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు టెస్ట్ ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. భారత్ నుంచి దుబాయ్, అబుధాబి, షార్జా వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ఫలితాలను సమర్పించాల్సి ఉంటుందని యూఏఈ వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?