కువైట్ లో గుండెపోటు తో మృతి చెందిన ఏ.పి వాసి
- July 21, 2020
కువైట్ సిటీ:వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన దేవరపల్లి రామకృష్ణయ్య (26) ఈ నెల 10 వ తేదీన కువైట్ లోని ఖేతాన్ ప్రాంతలో గుండెపోటు తో మృతి చెందాడు.
గత 4 సంవత్సరాల నుంచి కువైట్ లో జీవనోపాధి కోరకు వచ్చి జీవనం సాగిస్తున్నారు. మృతుని తల్లి కూడా కువైట్ లోనే పనిచేసుకుంటూ వున్నారు. రామకృష్ణయ్య చనిపోయిన విషయం వారి మేనమామ రామాపురం లక్ష్మయ్య పెనగలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు. కొండూరు అజయ్ రెడ్డి కి ఫోన్ చేసి విషయం తెలుపగా, కొండూరు అజయ్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కి ఫోన్ చేసి మాట్లాడి, ఆయన దృష్టికి, తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి మృతదేహం స్వస్థలానికి పంపించేందుకు కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఇమిగ్రేషన్, మరియు పేపర్ వర్క్, సేవాదల్ ఇన్చార్జ్, గోవిందు రాజు ద్వారా పనులు పూర్తి చేయించారు.మృతుని కుటుంబ సభ్యులకు తగిన ఆర్ధిక సహాయం చేసారు.మృతదేహం, చెనై విమానాశ్రయం నుంచి మృతుని స్వస్థలం ఎన్ ఆర్ పురం గ్రామానికి, చేర్చేందుకు APNRTS వారి ద్వారా ఉచిత ఎంబులెన్సు సౌకర్యం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కొండూరు అజయ్ రెడ్డి, ముమ్మిడి బాలిరెడ్డి ,మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్) ,బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) , కృతజ్ఞతలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







