IPL అభిమానులకి శుభవార్త...
- July 21, 2020
భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపిఎల్ కి సంబంధించి, ఐపిఎల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఐపిఎల్ ని ఈ ఏడాది యూ.ఏ.ఈ లో నిర్వహిస్తామని ప్రకటించారు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్. తాజాగా ఆయన దీనిపై ఒక ప్రకటన చేసారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ ని యూ.ఏ.ఈ లో నిర్వహించాలని తాము భావిస్తున్నామని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
యూ.ఏ.ఈలో ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేశామన్నారు ఆయన. నిన్న టి20 ప్రపంచకప్ ని వాయిదా వేసినట్లు ఐసిసి ప్రకటన చేసింది. ఇక అక్కడి నుంచి భారీ ఆదరణ ఉన్న ఐపిఎల్ మీదనే చర్చలు అన్నీ జరిగాయి. క్వారంటైన్ సహా అనేక కరోనా నిబంధనలను పాటించి ఐపిఎల్ ని నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే షెడ్యుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







