IPL అభిమానులకి శుభవార్త...
- July 21, 2020
భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపిఎల్ కి సంబంధించి, ఐపిఎల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఐపిఎల్ ని ఈ ఏడాది యూ.ఏ.ఈ లో నిర్వహిస్తామని ప్రకటించారు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్. తాజాగా ఆయన దీనిపై ఒక ప్రకటన చేసారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ ని యూ.ఏ.ఈ లో నిర్వహించాలని తాము భావిస్తున్నామని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
యూ.ఏ.ఈలో ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేశామన్నారు ఆయన. నిన్న టి20 ప్రపంచకప్ ని వాయిదా వేసినట్లు ఐసిసి ప్రకటన చేసింది. ఇక అక్కడి నుంచి భారీ ఆదరణ ఉన్న ఐపిఎల్ మీదనే చర్చలు అన్నీ జరిగాయి. క్వారంటైన్ సహా అనేక కరోనా నిబంధనలను పాటించి ఐపిఎల్ ని నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే షెడ్యుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!