ఏపీలో కరోనా విజృంభణ.. .

- July 23, 2020 , by Maagulf
ఏపీలో కరోనా విజృంభణ.. .

అమరావతి:ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతుంది. ప్రతీరోజు వేలలో కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,998 మందికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఇందులో 37,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. 34,272మంది ఇంకా చికిత్స పోందుతున్నారు. అయితే, గడిచిన 24 గంట్లో 61 మంది మృతి చెందగా.. కరోనా మరణాలు 884కి చేరాయి. కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com