హైదరాబాద్లో ఇ-సిమ్ కార్డ్ మార్పిడి మోసాలు...
- July 24, 2020
హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉంటారు.. తాజాగా హైదరాబాద్లో సిమ్ కార్డు అప్డేట్ పేరుతో మోసానికి పాల్పడుతోన్న వ్యవహారం వెలుగుచూసింది.. ఈ- సిమ్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్తగా మోసాలు చేస్తున్నారు.. సిమ్ కార్డ్ అప్ డేట్ అంటూ ఫోన్ చేస్తారు.. సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని నమ్మబలికి ట్రాప్ చేస్తారు.. రిజిస్ట్రేషన్, ఈ మెయిల్, అప్ డేట్ అంటూ మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపుతారు.. అన్ని వివరాలు రాబట్టి.. మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తారు.
తాజాగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి.. మొత్తంగా ముగ్గురు బాధితుల నుంచి రూ.16 లక్షలకు పైగా నొక్కేశారు కేటుగాళ్లు.. మియాపూర్కు చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి వద్ద నుండి రూ. 9.20 లక్షలు, గచ్చిబౌలి కి చెందిన కుమార్ కుషల్ అనే వ్యక్తి నుంచి రూ. 5.94 లక్షలు, అదే ప్రాంతానికి చెందిన సురేష్ రమణ అనే వ్యక్తి నుండి రూ.1.04 లక్షలు కాజేశారు. ఇలాంటి మోసాలపై ఈ మధ్య ఫిర్యాదులు వరుసగా వస్తున్నాయని.. అపరిచితులకు వివరాలు చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఎయిర్టెల్ నెట్వర్క్ వినియోగదారులనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్టుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







