కువైట్ లో గుండెపోటుతో ఏ.పి వాసి మృతి

- July 25, 2020 , by Maagulf
కువైట్ లో గుండెపోటుతో ఏ.పి వాసి మృతి

కువైట్ సిటీ:ఆంధ్ర ప్రదేశ్,తూర్పు గోదావరి,రాజోలు మండలం,పొన్నమండ గ్రామం  కు చెందిన వెంకట సత్యనారాయణ స్వామి సరెల్ల(80 )గుండె పోటుతో మరణించాడు.15  జులై, 20న ఉదయం మృతి చెందాడు.కువైట్ లో ఏడు ఏండ్ల నుండి పని చేస్తున్నాడు.రేపు 27 జూలై 2020 ఉదయం 2.45 కు హైదరాబాద్ చేరనుంది.

సరెల్ల సూర్య నారాయణ తన అన్న కుమారుడు కువైట్ లో అన్ని సంతకాలకు, పనులకు వెంట ఉంటున్నాడు.మోకా సారా గౌరీ మృతుని స్వస్థలం లో పొరుగు ఆమె, ప్రవీణ్ చింతలదానం గల్ఫ్ తెలంగాణ కార్మికుల సమితి అధ్యక్షుడు, మురళీధర్ రెడ్డి తెలుగు తెలంగాణ సంక్షేమ సంఘం  తో కలిసి పనులలో వెంట ఉండి చక్క బెడుతున్నాడు. ఇండియన్ ఎంబసీ సానుకూలంగా స్పంచిందింది.

 వెంకట్ మేడపాటి(APNRTS చైర్మన్), ఇలియాస్( డైరెక్టర్), మమ్మిడి బాల్ రెడ్డి(కువైట్ ఇంఛార్జి)  ద్వారా ఎంబులన్స్ సహకారం అందింది.కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అతనికి చదువు లేనందువల్ల ఎటువంటి పని ఉండేదికాదు.కాబట్టి కువైట్ వెళ్లి జీవనోపాధి వెతుక్కున్నాడు ఇతనికి ఒక చిన్న రెండు గదుల ఇల్లు, పొలం ఏమిలేదు,తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబ సభ్యులు చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలను కూడా కల్పించడానికి, సంక్షేమ కార్యక్రమాలు వీరికి వర్తిస్తే  ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆర్థిక స్థోమత లేని  మృతదేహాలను  ప్రభుత్వ ఖర్చుతో ఇంటికి పంపుతూ అంబులెన్సు నుండి దహన సంస్కారాలవరకు తోడ్పడే ఆలోచన చేయాలని ఎక్కువగా మన తెలుగు వారే కార్మికులుగా,స్వదేశం లో అవకాశాలు లేక విదేశాల లో పనులకు వెళ్లి అంతంత మాత్రమే సంపాదించారని.వీరిని ఆదుకోవాలని మురళీధర్ రెడ్డి గంగుల అభిప్రాయ పడ్డారు.

APNRTS లో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని ఆ సంస్థలో ఏ.పి రాష్ట్రానికి చెందిన వారు రిజిస్టర్ చేసుకోవాలని వారి నైపుణ్యత,విద్య,అనుభవం బట్టి వారికీ ఉపాధి అవకాశాలకు ఆ సంస్థ తోడ్పడుతుందని ఆ సంస్థ సూచించే విధంగా భీమా కూడా చేసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఉపయోగకరం అని మురళీధర్ రెడ్డి తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com