కరోనా నుంచి కోలుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు

- July 25, 2020 , by Maagulf
కరోనా నుంచి కోలుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు

సావో పౌలో:రెండు వారాల చికిత్స అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా నుండి కోలుకున్నారు. శనివారం తన నివేదిక తిరిగి నెగెటివ్‌గా వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గత పదిరోజులలో ఆయనకు మూడుసార్లు కరోనా పరీక్షలు చేశారు. అయితే మూడు నివేదికలు కూడా పాజిటివ్ అనే వచ్చాయి. బోల్సోనారో జూలై 7 న కరోనా యొక్క తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నానని ప్రకటించారు.

దాంతో అదేరోజు ఆయనకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా బ్రెజిల్ లో గత 24 గంటల్లో 55,891 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు 23,43,366 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం నమోదైన కేసుల్లో 15,90,264 మంది కోలుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com