ఏపీలో కొత్తగా 7,627 మందికి కరోనా పాజిటివ్ కేసులు

- July 26, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 7,627 మందికి కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 47,645 శాంపిల్స్ ని పరీక్షించగా 7,627 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.
అలాగే కొత్తగా 3,041 మంది కోవిద్‌ నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి-09,విశాఖపట్నం-08,కర్నూల్-06,కృష్ణ-05,నెల్లూరు-05,శ్రీకాకుళం-05,పశ్చిమ గోదావరి-05,చిత్తూర్‌-04,విజయనగరం-03,అనంతపూర్-02,కడప-02,గుంటూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను 43,447 మంది డిశ్చార్జ్ కాగా.. 1041 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com