గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఒక్కరోజే లక్ష మొక్కలు
- July 26, 2020హైదరాబాద్:టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే తమ స్నేహితులను కూడా నామినేట్ చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం అంచలంచలుగా పెరుగుతోంది. నెటిజన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంపీ సంతోష్ కుమార్ ను ట్యాగ్ చేస్తున్నారు.
తాజాగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబిలీహిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్ కుమార్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సినీ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడిలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు