గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఒక్కరోజే లక్ష మొక్కలు
- July 26, 2020
హైదరాబాద్:టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే తమ స్నేహితులను కూడా నామినేట్ చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం అంచలంచలుగా పెరుగుతోంది. నెటిజన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంపీ సంతోష్ కుమార్ ను ట్యాగ్ చేస్తున్నారు.
తాజాగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబిలీహిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్ కుమార్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సినీ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడిలు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







