దుబాయ్:విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాలు జారీ
- July 30, 2020
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం బుధవారం నుంచి విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాల జారీని ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్ కూడా లాక్డౌన్ అయింది. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడంతోపాటు అన్ని రకాల వీసాల జారీని నిలిపివేసింది.దుబాయ్ లో కరోనా ఉధృతి తగ్గుముఖంపట్టడంతో.. విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాల జారీని ప్రారంభించారు. బుధవారం రోజు దుబాయ్లోని జనరల్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ (GDRFA).కొన్ని మినహాయింపులతో అన్ని దేశాల పౌరులకు విజిట్ వీసాలు ఇవ్వడాన్ని ప్రారంభించిందని అమీర్ సెంటర్, ట్రావెల్ ఏంజెట్లు స్పష్టం చేశారు. కాగా.. అమీర్ బ్రాంచ్లోని కస్టమర్ సర్వీస్ అధికారి మాట్లాడుతూ...రెసిడెన్సీ, విజిల్ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ASAT టూరిజం మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ... మేము బుధవారం కొన్ని అప్లికేషన్లను సమర్పించాము అన్నిటికీ వీసాలు వచ్చాయి. ఇది ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందన్నారు.ఈద్ అల్ అదా సందర్భంగా తమ కార్యాలయాలకు ఆదివారం వరకు సెలవులు తిరిగి సోమవారం ప్రారంభమవుతాయని సంబంధిత అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







