దుబాయ్:విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాలు జారీ

- July 30, 2020 , by Maagulf
దుబాయ్:విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాలు జారీ

దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం బుధవారం నుంచి విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాల జారీని ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్ కూడా లాక్‌డౌన్ అయింది. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడంతోపాటు అన్ని రకాల వీసాల జారీని నిలిపివేసింది.దుబాయ్ లో కరోనా ఉధృతి తగ్గుముఖంపట్టడంతో.. విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాల జారీని ప్రారంభించారు. బుధవారం రోజు దుబాయ్లోని జనరల్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ (GDRFA).కొన్ని మినహాయింపులతో అన్ని దేశాల పౌరులకు విజిట్ వీసాలు ఇవ్వడాన్ని ప్రారంభించిందని అమీర్ సెంటర్, ట్రావెల్ ఏంజెట్లు స్పష్టం చేశారు. కాగా.. అమీర్ బ్రాంచ్‌లోని కస్టమర్ సర్వీస్ అధికారి మాట్లాడుతూ...రెసిడెన్సీ, విజిల్ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ASAT టూరిజం మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ... మేము బుధవారం కొన్ని అప్లికేషన్లను సమర్పించాము అన్నిటికీ వీసాలు వచ్చాయి. ఇది ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందన్నారు.ఈద్ అల్ అదా సందర్భంగా తమ కార్యాలయాలకు ఆదివారం వరకు సెలవులు తిరిగి సోమవారం ప్రారంభమవుతాయని సంబంధిత అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com