ఇండియా-యూఏఈ బుకింగ్స్ ప్రారంభం..జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు బుకింగ్స్
- July 31, 2020
యూఏఈ: ఎట్టకేలకు ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అబుధాబి, దుబాయ్, షార్జా ప్రయాణాలకు నేటి(జులై 31) నుంచి బుకింగ్స్ ప్రారంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. కొచ్చి, ఢిల్లీ, మంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ నుంచి విమానాలు నడపనున్నారు. అయితే..ఐసీఏ, జీడీఆర్ఎఫ్ఏ ఆమెదించిన రెసిడెన్సీ వీసాదారులు మాత్రమే టికెట్ బుకింగ్స్ అర్హులు అని కూడా క్లారిటీ ఇచ్చారు అధికారులు. రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి అనుమతి లేదని, టికెట్లు బుక్ చేసుకున్నా చెక్ ఇన్ సమయంలోనే వాళ్లను నిలిపివేస్తామని వెల్లడించారు. వీసా గడువు ముగిసిన వారు యూఏఈ వెళ్లాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇండియా నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులు చెక్ ఇన్ సమయంలో ఖచ్చితంగా తమ వెంట కోవిడ్ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ప్రింటెడ్ కాపీని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణానికి 96 గంటలలోపు తీసుకున్న టెస్ట్ రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక పన్నెండేళ్లలోపు పిల్లలకు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని అధికారులు వెల్లడించారు. అయితే..దుబాయ్, అబుధాబి, షార్జా చేరుకునే ప్రయాణికులకు ఆయా విమానాశ్రయాల్లో ఒక్కో మార్గదర్శకాలను పాటించనున్నారు.
దుబాయ్ : దుబాయ్ చేరుకునే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో కోవిడ్ పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. టెస్ట్ ఫలితాలు వచ్చేవరకు వారు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ పాజిటివ్ వస్తే దుబాయ్ ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాల మేరకు ఐసోలేషన్ పాటించాల్సి ఉంటుంది.
అబుధాబి: అబుధాబి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేస్తారు. అలాగే శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తారు.
షార్జా: షార్జా చేరుకోగానే కోవిడ్ పీసీఆర్ టెస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







