అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా
- July 31, 2020
అల వైకుంఠపురం లో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తో సరి కొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పి, అదే ఉత్సహంతో వరుస సినిమాలుతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ "పుష్ప" కి సంబంధించిన వివిధ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరో క్రేజీ సినిమాతో ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్ స్టార్, వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాలశివ తో కలిసి సినిమా చేయబోతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో అగ్ర నిర్మాణ సంస్థ జీ ఏ 2 పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణంలో భాగస్వామిగా ఉండనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మిత్రులు శాండీ, స్వాతి, నట్టి లు జీ ఏ 2 పిక్చర్స్ సారథ్యంలో ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.
స్నేహితులే చిత్ర నిర్మాణ సారధులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుల్ని, బంధువుల్ని, సన్నిహితులని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. ‘రేసుగుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘పుష్ప’ సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో తన మిత్రులు శాండీ, స్వాతి, నట్టి లకు ఈ చిత్రానికి సహ నిర్మాతులుగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ కొరటాల శివ కి సన్నిహితుడు, స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ కి ఫుల్ క్రేజ్
అటు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే వివిధ స్టార్ హీరోలతో పని చేశారు, ఇటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వివిధ ప్రముఖ దర్సకులతో పని చేశారు. కానీ ఈసారి మాత్రం వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ పై అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఇటు సాధరణ ప్రేక్షకులుల్లో భారీగా అంచనాలు నెల కొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వ బోతుంది.
బ్యానర్ : యువ సుధ ఆర్ట్స్ - జీ ఏ 2 పిక్చర్స్
నిర్మాత : సుధాకర్ మిక్కిలినేని
సహ నిర్మాతలు : సాండీ, స్వాతి, నట్టి
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







