ఫోన్, వ్యాలెట్ దొంగతనం: నిందితుడికి మూడేళ్ళ జైలు
- August 01, 2020మనామా:మొబైల్ ఫోన్ అలాగే వ్యాలెట్ని గ్రోసరీ స్టోర్ వర్కర్ నుంచి దొంగిలించిన నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ క్రిమినల్ కోర్ట్. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ ఘటన జరిగింది. ఇన్ స్టోర్ సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనం వెలుగు చూసింది. నిందితుడు పారిపోతున్న వాహనాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గురించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కారులో పారిపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ కారు ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. ఆమె భర్త ఆ కారుని వినియోగిస్తున్నట్లు గురించారు. అయితే, ఆ వ్యక్తి తన సోదరుడు ఇన్టాక్సికేటింగ్ సబ్స్టాన్స్ ప్రభావంలో వున్నాడనీ, ఈ క్రమంలోనే ఇదంతా జరిగి వుండొచ్చని చెప్పారు. నిందితుడు, విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?