ఈ సంవత్సరం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఏ.పి గవర్నర్
- August 02, 2020
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వలన నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం.ఆగస్టు 3 న తన జన్మదిన వేడుకలను జరుపకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ నిర్ణయించారు. వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్ భవన్ కు ఎవరూ రాకూడదని గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ సంబంధిత వారు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే ఉండి, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని గవర్నర్ హరిచందన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ మరియు పద్ధతులను పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని గవర్నర్ హరిచందన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







