కోవిడ్ 19: బహ్రెయిన్ లో సున్నాకు చేరిన కోవిడ్ మృతుల సంఖ్య
- August 02, 2020
మనామా:బహ్రెయిన్ లో కోవిడ్ డెత్ రేట్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం కోవిడ్ మృతుల సంఖ్య సున్నాకు చేరింది. అంతేకాదు..కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 371కి పెరిగింది. దీంతో బహ్రెయిన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 38,211కి చేరినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా 2,832 యాక్టీవ్ కేసులు ఉండగా అందులో 2,789 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. యాక్టీవ్ కేసులలో 81 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 43 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు శనివారం దేశవ్యాప్తంగా 4,569 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు కింగ్ డమ్ లో మొత్తం 8,35,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. లేటెస్ట్ గా నిర్వహించిన టెస్టులో 208 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!