భారతదేశానికి వచ్చే ప్రయాణీకులకు ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు
- August 02, 2020
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 8 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను ఆదివారం జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మొదటి 7 రోజులు వారి సొంత ఖర్చులతో.. కేంద్రం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలో, తదుపరి వారం రోజులు క్వారంటైనర్లో ఉండాలని పేర్కొంది.
ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు. ఇన్ వెబ్సైట్లో ప్రయాణానికి 72 గంటల ముందుగా సమర్పించాలని పేర్కొంది. ఇక గర్భిణిలు, పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్కు అనుమతిస్తామని తెలిపారు. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?