IPL-2020‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్రం

- August 02, 2020 , by Maagulf
IPL-2020‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్రం

యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న IPL 13 ఎడిష‌న్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు IPL నిర్వ‌హ‌ణ‌కు భారత కేంద్ర ప్రభుత్వం BCCIకి అనుమ‌తులు ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు IPL-2020 జ‌ర‌గ‌నుంది.యూఏఈ టైం ప్రకారం రాత్రి 06:00 గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి.కాగా IPL‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో BCCI ఊపిరి పీల్చుకుంది. ఇప్ప‌టికే IPL టోర్నీకి గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నుంచి BCCI అనుమ‌తి తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా అనుమ‌తి ఇవ్వ‌డంతో IPL టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు మార్గం సుగ‌మ‌మం అయింది.

కాగా IPL టోర్నీని దుబాయ్‌లో నిర్వ‌హించేందుకు కావ‌ల్సిన అనుమ‌తికి గాను BCCI అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఎంతో ప్ర‌య‌త్నించారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కృషి ఫ‌లించింది. ఈ క్ర‌మంలో BCCI IPL పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com