అయోధ్య రామ మందిరం భూమి పూజ ఆహ్వాన పత్రిక

- August 03, 2020 , by Maagulf
అయోధ్య రామ మందిరం భూమి పూజ ఆహ్వాన పత్రిక

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోడి శంకుస్థాపన చేయనున్నారు. అయిదు వెండి ఇటుకలతో భూమి పూజ నిర్వహించనున్నారు. ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు.

భూమి పూజ ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్న కార్డు కాషాయం రంగులో ఉంది. భారత ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ రావ్ భగవత్ పేరుఉండగా.. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానిస్తున్నట్టు కార్డు ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com