కోవిడ్ ఎఫెక్ట్ : దుబాయ్ విద్యార్ధులకు ఈ ఏడాది దూరవిద్యా విధానం
- August 05, 2020
కరోనా ఎఫెక్ట్ ఈ విద్యా సంవత్సరంపై పెను ప్రభావం చూపిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించేందుకు సంకోచిస్తున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో దూరవిద్య ద్వారా పాఠాలు నేర్చుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఆగస్ట్ 30 నుంచి స్కూళ్లు ప్రారంభించాలనుకున్న నేపథ్యంలో తొలుత విద్యార్ధులకు ఇన్ క్లాస్ విద్యా విధానాన్నే అమలు చేయాలని యోచించింది. అయితే..పిల్లలను స్కూళ్లకు పంపించే విషయమై తల్లిదండ్రుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మానవ అభివృద్ధి, విజ్ఞాన అధికార విభాగం అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్స్ కి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖాముఖి విద్యా విధానమే తమ విధానమైనప్పటికీ..విద్యార్ధుల తల్లిదండ్రులు కోరితే వందశాతం డిస్టెన్స్ లెర్నింగ్ సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులో పేర్కొంది. భవిష్యత్తులో విద్యార్ధులు ముఖాముఖి విద్యకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







