దుబాయ్:వీసా ఫైన్ మాఫీ కోసం ప్రవాసభారతీయుల నుంచి 750 దరఖాస్తులు

- August 06, 2020 , by Maagulf
దుబాయ్:వీసా ఫైన్ మాఫీ కోసం ప్రవాసభారతీయుల నుంచి 750 దరఖాస్తులు

యూఏఈలో రెసిడెన్సీ, వీసా గడువు ముగిసిన ప్రవాసభారతీయులు వీసా ఫైన్ మాఫీ స్కీంలో భాగంగా దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీత గడువు కంటే ఎక్కువ రోజులుగా యూఏఈలో ఉన్న వారు ఫైన్ మాఫీ కోరుతూ 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాన్సులేట్ జనరల్ కు అందిన దరఖాస్తులో ఇప్పటివరకు 146 మంది అప్లికేషన్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారెన్ అఫైర్స్(DGRFA) ఆమోదించింది. ఇదిలాఉంటే..మార్చి 1 కంటే ముందు విజిట్, రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు...అనుమతి గడువు కంటే ఎక్కువ రోజులు దేశంలో ఉన్నందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంది. అయితే..భారతీయుల కోసం ఇండియన్ డిప్లామాటిక్ మిషన్ ప్రకటించిన దుబాయ్..ఆగస్ట్ 17లోగా దేశం విడిచి వెళ్లే వారికి జరిమానాను రద్దు చేయనున్నట్లు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com