పవన్ కల్యాణ్ తో భాజపా నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ
- August 07, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ ని హైదరాబాద్ లో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముచ్చటించారు. అంతేకాదు.. జనసేనతో కలిసి బీజేపీ ప్రణాళికలకు సంబంధించిన కీలక అంశాల్ని ఈ భేటీలో ముచ్చటించారు.
ముఖ్యంగా ఆ ఇద్దరి భేటీలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అంశంపైనే చర్చ సాగింది. ఆర్థికంగా సామాజికంగా నిర్మాణాత్మకంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికా బద్ధమైన ప్లాన్ చేసేందుకు ఈ కలయిక అని తెలుస్తోంది. త్వరలో ఉభయులు సమావేశమై 2024 ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా అధికారంలోకి వచ్చే ప్రణాళికల్ని రూపుదిద్దనున్నారు. అలానే రాజధాని మార్పు సహా అమరావతిలోని రైతులు సమస్యలపైనా రకరకాల అంశాల్ని చర్చించాలని పవన్ - వీర్రాజు ఇద్దరు నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







