పవన్ కల్యాణ్ తో భాజపా నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ
- August 07, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ ని హైదరాబాద్ లో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముచ్చటించారు. అంతేకాదు.. జనసేనతో కలిసి బీజేపీ ప్రణాళికలకు సంబంధించిన కీలక అంశాల్ని ఈ భేటీలో ముచ్చటించారు.
ముఖ్యంగా ఆ ఇద్దరి భేటీలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అంశంపైనే చర్చ సాగింది. ఆర్థికంగా సామాజికంగా నిర్మాణాత్మకంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికా బద్ధమైన ప్లాన్ చేసేందుకు ఈ కలయిక అని తెలుస్తోంది. త్వరలో ఉభయులు సమావేశమై 2024 ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా అధికారంలోకి వచ్చే ప్రణాళికల్ని రూపుదిద్దనున్నారు. అలానే రాజధాని మార్పు సహా అమరావతిలోని రైతులు సమస్యలపైనా రకరకాల అంశాల్ని చర్చించాలని పవన్ - వీర్రాజు ఇద్దరు నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







