ప్రభాస్ చేతుల మీదుగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫస్ట్ లుక్ లాంచ్
- August 07, 2020వినాయకుడు ఫేమ్ కృష్ణుడు నిర్మాతగా వస్తున్న సినిమా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన ప్రభాస్.ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ నిర్మించారు. త్వరలోనే ఓటిటి లో రిలీజ్ కానున్న ఈ సినిమా కు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభినందనలు తెలియజేశారు..
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా అందరికి నచ్చేలా కంప్లీట్ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ గా మా సినిమా ఉంటుంది అన్నారు. ఫైనల్ అవుట్పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తు న్నామన్నారు నటుడు , నిర్మాత కృష్ణుడు.ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ ను దర్శకుడిగా తెలుగు తెర కు పరిచయం చేయబోతున్నాడు కృష్ణుడు
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ