భారత్ లో ఒక్కరోజే 62,538 కరోనా పాజిటివ్ కేసులు
- August 07, 2020
భారత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజుకు రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 62,538 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు 60 వేలకు పైగా కేసులు నమోదుకావడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరింది.
అటు, మరణాలు కూడా ప్రతీరోజు రికార్డు సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క రోజే 886 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు 41,585 మంది కరోనాతో మృతి చెందారు. కాగా.. ఇప్పటికవరకూ 13,78,106 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 6,07,384 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఓవైపు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?