ఖతార్ కు NRIల తిరుగు ప్రయాణంపై కసరత్తు..భారత రాయబార కార్యాలయం ప్రకటన
- August 07, 2020
దోహా:ఇండియా నుంచి ఖతార్ తిరిగి వెళ్లాలనుకుంటున్న ప్రవాసభారతీయులకు సంబంధించి తాము తగిన కసరత్తు చేస్తున్నామని ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సరైన రెసిడెన్సీ పర్మిట్ ఉండి ఖతార్ తిరుగు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు తమ సూచనలు ఎప్పటికప్పుడు గమనించాలని కోరింది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయినా తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తామని కూడా వెల్లడించింది. ఖతార్ తిరుగు ప్రయాణం అయ్యే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేసేలా తాము కసరత్తు చేస్తున్నామని వివరించింది. అయితే..తమ సూచనలు అందేవరకు ఎవరూ ముందస్తుగా విమాన టికెట్లను బుక్ చేసుకోవద్దని కూడా హెచ్చరించింది. కొన్ని సంస్థలు, ఏజెంట్లు సోషల్ మీడియా వేదికగా ఖతార్ ప్రయాణానికి టికెట్లు అమ్మకాలు జరుపుతున్నారని..ప్రస్తుతానికి ఖతార్-భారత్ మధ్య రెగ్యూలర్ విమాన సర్వీసులు నడవటం లేదన్న విషయాన్ని గమనించాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే..కొన్ని ప్రత్యేక అనుమతులపై ఆరోగ్య రంగ ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఉద్యోగులు ఛార్టెడ్ విమానాల ద్వారా ప్రయాణిస్తున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!