ఖతార్ కు NRIల తిరుగు ప్రయాణంపై కసరత్తు..భారత రాయబార కార్యాలయం ప్రకటన
- August 07, 2020దోహా:ఇండియా నుంచి ఖతార్ తిరిగి వెళ్లాలనుకుంటున్న ప్రవాసభారతీయులకు సంబంధించి తాము తగిన కసరత్తు చేస్తున్నామని ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సరైన రెసిడెన్సీ పర్మిట్ ఉండి ఖతార్ తిరుగు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు తమ సూచనలు ఎప్పటికప్పుడు గమనించాలని కోరింది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయినా తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తామని కూడా వెల్లడించింది. ఖతార్ తిరుగు ప్రయాణం అయ్యే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేసేలా తాము కసరత్తు చేస్తున్నామని వివరించింది. అయితే..తమ సూచనలు అందేవరకు ఎవరూ ముందస్తుగా విమాన టికెట్లను బుక్ చేసుకోవద్దని కూడా హెచ్చరించింది. కొన్ని సంస్థలు, ఏజెంట్లు సోషల్ మీడియా వేదికగా ఖతార్ ప్రయాణానికి టికెట్లు అమ్మకాలు జరుపుతున్నారని..ప్రస్తుతానికి ఖతార్-భారత్ మధ్య రెగ్యూలర్ విమాన సర్వీసులు నడవటం లేదన్న విషయాన్ని గమనించాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే..కొన్ని ప్రత్యేక అనుమతులపై ఆరోగ్య రంగ ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఉద్యోగులు ఛార్టెడ్ విమానాల ద్వారా ప్రయాణిస్తున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు