2 పడక గదుల ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో ..

- February 06, 2016 , by Maagulf
2 పడక గదుల ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో ..

సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్‌ సూచనతో బల్దియాలో గెలిచిన వెంటనే కాలనీల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పేదలందరికీ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బస్తీ వాసులకు 6 నెలల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌ నగరంలో లక్ష 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com