దుబాయ్-కోజికోడ్ విమాన ప్రమాదానికి కారణం 'టేబుల్ టాప్' రన్వే..
- August 08, 2020
కేరళ:191 మందితో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ చేరుకుంది. విమానం లాండింగ్ సమయంలో ఘోరం జరిగింది.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడుపుతున్న బోయింగ్ 737-800 విమానం కోజికోడ్ విమానాశ్రయం రన్వే - మంగళూరు వంటి టేబుల్టాప్ రన్వే కావడంతో 35 అడుగుల వాలులో పడిపోయింది. ఫలితంగా విమానం రెండుగా విడిపోయింది. కోజికోడ్ రన్వే చుట్టూ రెండు వైపులా పెద్ధ లోయలు ఉన్నాయి. టేబుల్టాప్ రన్వేలు సాధారణంగా కొండ పైభాగంలో నిర్మించబడతాయి. పైగా రన్వేను ఓవర్షూట్ చేయడానికి ఎటువంటి మార్జిన్ లేకపోవడం వల్ల ల్యాండింగ్ సమయంలో అత్యంత జాగురూకత వహించాల్సి ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు జరుగుతాయి. తాజా ప్రమాదం అటువంటిదే.
విమానం కూలిపోయినప్పుడు మంటలు చెలరేగలేదని, తద్వారా ప్రాణనష్టం తగ్గుతుందని ప్రభుత్వ సీనియర్ అధికారులు భావిస్తున్నారు. DGCA అధికారి ఒకరు మాట్లాడుతూ, విమానం సాధారణ వేగం కంటే ఎక్కువ వేగంతో లాండైనట్లు అనిపించింది. కోజికోడ్ తో పాటు మంగళూరు, మిజోరంలోని లెంగ్పుయి విమానాశ్రయం, సిక్కింలో పాక్యాంగ్ విమానాశ్రయం, హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, కులు విమానాశ్రయాలు టేబుల్ టాప్ లలో నిర్మించబడ్డాయి. భారతదేశం వెలుపల ఉన్న ఇతర టేబుల్టాప్ విమానాశ్రయాలలో భూటాన్లోని పారో, నేపాల్లోని ఖాట్మండు ఉన్నాయి.
2010 లో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో రన్వేపైకి దూసుకెళ్లి లోయలో కూలిపోయి మంటలు చెలరేగడంతో 158 మంది మరణించారు. అదే మొదటి అతి పెద్ద విమాన ప్రమాదమని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం, దుబాయ్ నుండి మరో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళూరు వద్ద రన్వేపైకి దూసుకెళ్లి నిదానంగా ఆగిపోయింది. దీనివల్ల విమానంలో ఉన్న 181 మంది ప్రయాణికులు భయపడ్డారు. వాస్తవానికి 2010 లో మంగళూరు సంఘటన జరిగిన వెంటనే డిజిసిఎ విమానాలను కోజికోడ్ విమానాశ్రయంలో దిగకుండా నిషేధించింది. 2,860 మీటర్ల ఎత్తులో, కోజికోడ్ యొక్క రన్వే మంగళూరు కంటే 400 మీటర్ల పొడవు ఉంది. విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కోజికోడ్ విమానాశ్రయంలో వాతావరణం పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. వర్షాలు కురుస్తున్న కారణంగా రన్వే ఉపరితలంపై నీరు నిల్వ ఉండి నేల చిత్తడిగా ఉంది. ఇది విమానం స్కిడ్ అవడానికి దారి తీస్తుంది. సిబ్బంది కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. దాంతో సమయానికి విమానాన్ని ఆపడం పైలట్లకు మరింత కష్టమవుతుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







