టర్కీలో పేలుడు: 9మంది మృతి,25 మంది గాయలు
- February 06, 2016
టర్కీలోని సిజ్రే పట్టణంలోని ఓ భవంతిలో పేలుడు సంభవించి 9 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. హెచ్డీపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం పట్టణంలోని ఓ భవంతిలో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మృతిచెందారు. ఘటనాస్థలానికి బయలుదేరిన అంబులెన్సులను భద్రతాదళాలు అడ్డుకున్నట్లు చెప్పారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ అనుబంధ మిలిటెంట్లు, భద్రతాదళాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 14 నుంచి అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ఘర్షణల్లో గాయపడ్డవారు సైతం జనవరి 23 నుంచి వైద్య సేవలకోసం వేచిచూస్తున్నారు.భద్రతాదళాలు అంబులెన్సులను పంపడానికి అనుమతించకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయని పలువురు నేతలు పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యసేవలు అందడం లేదని హెచ్డీపీ నేతలు చేసిన ఆరోపణలను టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్, ప్రధానమంత్రి దావుతొగ్లు కొట్టిపారేశారు. క్షతగాత్రులు ఎక్కడున్నా వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









