సిఎజిగా బాధ్యతలు స్వీకరించిన గిరీష్ చంద్ర ముర్ము
- August 08, 2020
న్యూ ఢిల్లీ:జమ్మూ కాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము శనివారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి) గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తదితరుల సమక్షంలో ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముర్ము బుధవారం జమ్మూ కాశ్మీర్ ఎల్జీ పదవి నుంచి వైదొలిగి గురువారం సిఎజిగా నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 లోని 1 వ నిబంధన ద్వారా తనకు ఉన్న
అధికారాన్ని బట్టి, గిరీష్ చంద్ర ముర్మును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా రాష్ట్రపతి నియమించారు. సిఎజిగా బాధ్యతలు చేపట్టిన ముర్ము రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల యొక్క అన్ని ఖర్చులను ఆడిట్ చేయడానికి బాధ్యత వహిస్తారు. ఈ పదవిలో ఆరు సంవత్సరాలు లేదా ఆయనకు 65 ఏళ్ళు వచ్చేవరకు ఏది మొదట వస్తే అంతవరకూ ఉంటారు. ఇదిలావుంటే సిఎజిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి గిరిజనుడు గిరీష్ చంద్ర ముర్ము కావడం విశేషం.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







