1.3 మిలియన్ల సౌదీ రియాల్స్ చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
- August 08, 2020
సౌదీ: మదీనాలో చోరీకి పాల్పడిన ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు సౌదీలు ఉండగా, మరో ముగ్గురు యెమనీ నివాసితులు ఉన్నారు. మదీనాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులు 1,50,000 సౌదీ రియాల్స్ తో పాటు 2,00,000 సౌదీ రియాల్స్ విలువైన బంగారు నగలను దొంగిలించినట్లు మదీనా పోలీసులు వివరించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించి తదుపరి విచారణ చేపట్టినట్లు వివరించారు. ఇదిలాఉంటే మరో చోరీ ఘటనలో ఇద్దరు సౌదీ వ్యక్తులతో పాటు ఓ యెమన్ నివాసితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మదీనాలోని ఓ ఇంట్లో నుంచి 1,80,000 సౌదీ రియాల్స్, 2,00,000 సౌదీ రియాల్స్ విలువైన బంగారు అభరణాలను నిందితులు దోచుకెళ్లిన ఆరోపణల్లో వీరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







