మస్కట్: గతేడాదితో పోలిస్తే ఒమన్ లో తగ్గిన ప్రవాసీయుల సంఖ్య
- August 08, 2020
ఒమన్ లో ప్రవాసీయుల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతూ వస్తోంది. ఒమనైజేషన్ లో భాగంగా గతంలో కంటే స్థానికులకే ఎక్కువ ప్రధాన్యం ఇస్తుండటంతో ఒమన్ లో బతుకుదెరువు కోసం వచ్చే వారి సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ వార్షికంలో ఒమన్ లోని ప్రవాసీయుల రేటు 9.3 శాతానికి తగ్గింది. దీంతో ప్రస్తుతం ఒమన్ లోని ప్రవాసీయుల సంఖ్య 15,89,883కి తగ్గింది. జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం దగ్గరున్న వివరాల మేరకు గతంతో పోలీస్తే ప్రస్తుత ఏడాది ప్రవాసీయుల సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఒమనైజేషన్ తో పాటు కరోనా సంక్షోభ ప్రభావం కూడా విదేశీయుల రాకపై ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







