సౌదీలో కరోనా నుంచి కోలుకున్న 2,50,000 మంది
- August 09, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు కింగ్ డమ్ లో కరోనా బారిన పడిన వారిలో 2,50,000 మంది కోలుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు నిన్న కొత్తగా 1,492 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కరోనా కేసులలో రియాద్ లో 101, మదినాలో 61, దమ్మమ్ లో 47, జాజమ్ లో 47 మంది ఉన్నారు. ఇదిలాఉంటే వైరస్ బారిన పడి మరో 37 మంది చనిపోయినట్లు సౌదీ అరేబియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కింగ్ డమ్ పరిధిలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,130 మందికి పెరిగింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







